కన్నకూతురిపైనే అత్యాచారం

Webdunia
శనివారం, 24 ఆగస్టు 2019 (18:56 IST)
పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. దీంతోపాటు 5000 రూపాయల  జరిమానా విధించింది. ఈ దారుణం అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో జరిగింది. 

కసాయి తండ్రి రెండేళ్లపాటు కూతురిపై అత్యాచారం చేశాడు. 2014 లో అత్యాచారం గురించి పాప స్కూల్ టీచరుతో చెప్పడంతో ఇది వెలుగులోకి వచ్చింది.  తల్లిని కోల్పోయిన  బాలిక  తండ్రి, సోదరుడితో కలిసి ఉంటోంది. తండ్రి రెండేళ్ల నుంచి కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాలిక బంధువుల ఇంటికి వెళ్లిపోయింది.

తండ్రి బెదిరించడంతో జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. 2014లో రాఖీ పండగ సందర్భంగా కుమార్తెను ఇంటికి పిలిచి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక ఉపాధ్యాయుడికి చెప్పి ఆయన ద్వారా జిల్లా పిల్లల రక్షణ కేంద్రం దృష్టికి, కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.

పదేళ్ల కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన లింగంకుమార్ అనే వ్యక్తికి  రంగారెడ్డి జిల్లా కోర్టు అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాలల హక్కుల సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  దోషికి ఈ శిక్ష సరిపోదని, మరణ శిక్ష విధించాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యాక్షుడు అత్యుత రావు డిమాండ్ చేశారు. ఈ తీర్పుపై అప్పీలుకు వెళతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Meenakshi Chaudhary: అలిపిరి నుంచి కాలినడక తిరుమలకు.. శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి (video)

Sri Vishnu: శ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మృత్యుంజ‌య్‌ రిలీజ్ డేట్

Devisri: ఉస్తాద్ భగత్ సింగ్ లో రెండు అదిరిపోయే పాటలు రాబోతున్నాయి

లోకేష్ కనకరాజ్ కూలీ సినిమాపై సౌందర్య రజనీకాంత్ ఏమన్నదో తెలుసా?

తెలిసినవారికి వివరణ అవసరం లేదు, చెప్పినా వినరు : ఏఆర్ రెహమాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం