Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వాసులకు శుభవార్త... నేడు రేపు వర్షాలు

Webdunia
శుక్రవారం, 19 మే 2023 (09:58 IST)
సూర్య ప్రతాపంతో రెండు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ తెలంగాణ వాసులకు శుభవార్త చెప్పింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడివుందని వెల్లడించింది. దీంతో ఈ రెండు రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 
 
ఇకపోతే, గురువారం నల్గొండలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 23.0 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు, భానుడి ప్రతాపంలో మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు తోడవుతుండటంతో ఎండ తీవ్రత మరింతగా పెరిగింది. గురువారం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కసుమూరులో అత్యధికంగా 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments