Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ వల్ల బాగుపడింది ఒక్క కుటుంబమే.. రాహుల్ గాంధీ

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (20:05 IST)
తెలంగాణ రాష్ట్రం ఓ ఒక్కరి వల్ల రాలేదని.. ఎందరో త్యాగమూర్తుల త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందని వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. కానీ తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు.  సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. 
 
తెలంగాణ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము చెప్పేది కేవలం వట్టిమాటలు కావని, తెలంగాణ రైతుల ప్రగతి గురించి తామిచ్చిన మాటను కచ్ఛితంగా నిలబెడతామని రాహుల్ హామీ ఇచ్చారు. ఈసారి ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని బల్లగుద్ది చెప్పారు. 
 
వరంగల్ డిక్లరేషన్ ఇచ్చామని చెప్పిన రాహుల్.. రైతులకు 2 లక్షల రుణమాఫీ, అలాగే 15 వేల రూపాయల సాయం రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. ఇది డిక్లరేషన్ మాత్రమే కాదని, కాంగ్రెస్ రైతులకు ఇచ్చే గ్యారంటీ రాహుల్ అన్నారు. రైతుల మాట కేసీఆర్ వినడం లేదని.. మిర్చి, పత్తికి మద్ధతు ధర లభించడంలేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments