Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనుమకొండలో రాహుల్ బహిరంగ సభ - భారీగా ఏర్పాట్లు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (10:00 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే ఆరో తేదీన జరిగే ఈ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని జనసమీకరణ చేయాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే, ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున ఉండేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. 
 
ఈ సభ ద్వారా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభకు వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేసే చర్యల్లోభాగంగా ఈ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. రాహుల్ సభ కోసం జన సమీకరణపై ఇప్పటి నుంచే టీ కాంగ్రెస్ నేతలు దృష్టిసారించారు. 
 
ముఖ్యంగా, మధు యాష్కీ గౌడ్, మహేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితలు క్రియాశీలకంగా వ్యవహిరస్తున్నారు. ఈ బహిరంగ సభ నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments