Webdunia - Bharat's app for daily news and videos

Install App

మునుగోడు ఉప ఎన్నికలు : ప్రజాశాంతి పార్టీలో చేరిన గద్దర్

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (20:28 IST)
ప్రజా గాయకుడు గద్దర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ క్రైస్తవ మత బోధకుడు  కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో గద్దర్ చేశారు. ఈయన త్వరలోనే మునుగోడులో జరుగనున్న ఉప ఎన్నికల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదేసమయంలో కేఏ.పాల్ చేపట్టిన ఆమరణ దీక్షను సైతం విరమించుకున్నారు. 
 
నవంబర్ మూడో తేదీన మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుంమది. ఈ ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగనున్నారు. గురువారం నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. మ‌రోవైపు ఈ నెల 2న పీస్ మీటింగ్‌కు పోలీసులు అనుమ‌తి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ విర‌మించారు. ఆయ‌న‌కు గ‌ద్ద‌ర్ నిమ్మ‌రసం ఇచ్చి దీక్ష విర‌మింపజేశారు.  
 
కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం పోరాటం చేసే గ‌ద్ద‌ర్ త‌న పాట‌ల‌తో తెలంగాణ స‌మాజాన్ని ఎంతో చైత‌న్యప‌రిచారు. తెలంగాణ ఉద్య‌మంలో సైతం ఆయ‌న పాట‌లు ఎంతో మందిలో స్ఫూర్తిని ర‌గిలించాయి. అయితే, ఆ మ‌ధ్య ఆయ‌న ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. 
 
గ‌తంలో ఎప్పుడూ ఓటు హ‌క్కు వినియోగించుకోని గ‌ద్ద‌ర్ ఈ మ‌ధ్య ఓటు వేశారు. అలాగే, హైద‌రాబాద్ నగరంలో జ‌రిగిన న‌రేంద్ర మోదీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రై అంద‌రినీ ఆశ్చ‌ర్యప‌రిచారు. అలాగే, గాంధీ భ‌వ‌న్‌కు కూడా వెళ్లి, తెరాస నేతలతో కూడా సమావేశమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments