Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకి ప్రధాని మోదీ: స్వాగతించేందుకు వెళ్లని సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:15 IST)
నెలరోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకలేదు. ఈసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రధానికి స్వాగతం పలకకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాటవేశారు. 
ప్రధాని రాకకు కొద్ది రోజుల ముందు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీని... ఎన్నికల కోసం వేషం అంటూ విమర్శించారు.

 
అంతేకాదు... బడ్జెట్ పైన కూడా ప్రధానమంత్రిని తూర్పారబట్టారు. మరోవైపు ప్రధానమంత్రి ఎయిర్‌పోర్ట్ వెల్‌కమ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడాన్ని తెలంగాణ బీజేపీ "ఇడియటిక్ మరియు సిగ్గుచేటు" అని అభివర్ణించింది. కేసీఆర్ నిత్యం రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది.
 
 
11వ శతాబ్దపు భక్తి సన్యాసి శ్రీ రామానుజాచార్య స్మారకార్థం, అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించేందుకు, 'సమానత్వ విగ్రహాన్ని' జాతికి అంకితం చేసేందుకు ప్రధాన మంత్రి రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.

 
 విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారనీ, రామానుజ విగ్రహావిష్కరణలో పాల్గొంటారని సమాచారం.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments