Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదుకి ప్రధాని మోదీ: స్వాగతించేందుకు వెళ్లని సీఎం కేసీఆర్

Webdunia
శనివారం, 5 ఫిబ్రవరి 2022 (17:15 IST)
నెలరోజుల వ్యవధిలో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలకలేదు. ఈసారి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రధానికి స్వాగతం పలకకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దాటవేశారు. 
ప్రధాని రాకకు కొద్ది రోజుల ముందు, ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని మోడీని... ఎన్నికల కోసం వేషం అంటూ విమర్శించారు.

 
అంతేకాదు... బడ్జెట్ పైన కూడా ప్రధానమంత్రిని తూర్పారబట్టారు. మరోవైపు ప్రధానమంత్రి ఎయిర్‌పోర్ట్ వెల్‌కమ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడాన్ని తెలంగాణ బీజేపీ "ఇడియటిక్ మరియు సిగ్గుచేటు" అని అభివర్ణించింది. కేసీఆర్ నిత్యం రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది.
 
 
11వ శతాబ్దపు భక్తి సన్యాసి శ్రీ రామానుజాచార్య స్మారకార్థం, అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించేందుకు, 'సమానత్వ విగ్రహాన్ని' జాతికి అంకితం చేసేందుకు ప్రధాన మంత్రి రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు.

 
 విమానాశ్రయంలో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కాగా సీఎం కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారనీ, రామానుజ విగ్రహావిష్కరణలో పాల్గొంటారని సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments