Webdunia - Bharat's app for daily news and videos

Install App

విషాదం మిగిల్చిన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్

Webdunia
ఆదివారం, 17 ఏప్రియల్ 2022 (19:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ విషాదం మిగిల్చింది. కాబోయే వధూవరులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలో జరిగింది. 
 
ఈ జిల్లాలోని అబ్దుల్లా పూర్‌మెంట్ మండల్ కోహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్‌ కోసం వధూవరులు వెళ్ళారు. వీరు ఫ్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్‌ ఎఫెక్టివ్‌గా ఉండటం కోసం పొగ పెట్టారు. దీంతో తేనెటీగలు పెళ్లికొడుకు, పెళ్లికూతురుపై దాడికి దిగాయి. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 
 
బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరో రెండు రోజుల్లో పెండ్లి బాజా భజంత్రీలతో సందడిగా మారాల్సిన ఆ గృహాల్లో ఇప్పుడు ఇలా జరగడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments