Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారు: పొంగులేటి సుధాకరరెడ్డి

Webdunia
మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (16:19 IST)
మంత్రి కేటీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాల్సిన విషయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు.

మంత్రి కేటీఆర్ అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో కేటీఆర్ విచక్షణ కోల్పోయి, అసహనంతో మాట్లాటాన్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం కాకుండా.. కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని పొంగులేటి సుధాకరరెడ్డి  దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే.. బీజేపీ కచ్చితంగా ప్రశ్నిస్తోందన్నారు.
 
కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కేటీఆర్ భాష తెలంగాణకే అవమానకరమన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాలపై కేటీఆర్ తన స్థాయికి మించి మాట్లాడాడని చెప్పారు. కేటీఆర్ బెదిరిస్తే.. బీజేపీ మరింత గట్టిగా ఎదుర్కొంటోందన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులపై టీఆర్ఎస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏమైందో కేటీఆర్ చెప్పాలని నిలదీశారు. బయ్యారం స్టీల్ ఫ్లాంట్‌పై టాస్క్‌ఫోర్స్ కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలని పొంగులేటి సుధాకరరెడ్డి డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments