జర్నలిస్టులను పోలీసులు అడ్డుకోవద్దు: సీఎం కేసీఆర్ ఆదేశాలు

Webdunia
శనివారం, 15 మే 2021 (16:13 IST)
పోలీసులు, జర్నలిస్టులకు మధ్య గొడవలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని ఇరువురి మధ్య గొడవలు మంచిది కాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హితవు పలికారు. కొవిడ్ లాక్ డౌన్ సందర్భంగా మీడియాకు ప్రభుత్వం పూర్తి అనుమతి ఇచ్చిందని స్పష్టం చేశారు. వారిని అడ్డుకుంటే ప్రజలకు ఎలాంటి సమాచారం లభించదని తెలిపారు.

చివరకు తాను ఏం మాట్లాడినా కూడా ప్రజల్లోకి వార్తలు వెళ్లే పరిస్థితి ఉండదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర డిజిపి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు శాఖను ఆదేశించాలని సీఎం కేసీఆర్ కోరారు. ప్రభుత్వమే వారికి అనుమతి ఇచ్చిందని ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు వారిని అడ్డుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించవద్దని ఆదేశించారు. ఇందులో ఎవరు అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన అవసరం మీడియాకు ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆర్టిస్టుల సమస్యలను దాటి తెరకెక్కిన పండంటి కాపురం ఒక తెలుగు క్లాసిక్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ కారణం అదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments