Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజు ఆత్మహత్యపై అనుమానాలు - పౌర హక్కుల సంఘం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (15:41 IST)
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి బస్తీలో సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే రాజుది ఆత్మహత్య కాదని.. కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని పౌర హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. 
 
కాగా, ఈ చిన్నారి హత్య కేసులో తప్పించుకుని తిరుగుతూ వచ్చిన నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలించారు. కానీ, ఆయన ఆచూకీ కనుగొనలేకపోయారు. ఈ క్రమంలో ఆయన ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించారు. ఇంతలోనే వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలోని నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. మృతుడి చేతిపై మౌనిక అనే పచ్చబొట్టు ఆధారంగా అతను రాజుగా గుర్తించారు. 
 
మరోవైపు రాజుది ఆత్మహత్య కాదు హత్యే అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులే తన భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని నిందితుడు రాజు భాగ్య మౌనిక ఆరోపించింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఇపుడు పౌర హక్కుల సంఘం కూడా ఇదే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments