Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ బిర్యానీ ఆరగించి 12 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (11:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఓ హోటల్‌లో బిర్యానీ ఆరగించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ఈ నెల 18వ తేదీన నర్సాపూర్‌లోని ఓ మండి హోటల్‌లో మండి బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి ఇంట్లో ఆరగించారు. ఈ బిర్యానీ ఆరగించిన తర్వాత మొత్తం ఏడుగురు యువకులు అస్వస్థతకు లోనయ్యారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
మెదక్ మండలంలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన పవన్, అరవింద్, మహేందర్ అనే యువకులు మండి హోటల్‌లో బిర్యానీ పార్శిల్ తీసుకెళ్లి, నర్సాపూర్‌కు చెందిన అజీజ్, మరో ఆరుగురు మిత్రులతో కలిసి ఆరగించారు. ఈ బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వారికి వాంతులు విరేచనాలు కావడంతో అస్వస్థతకు లోనయ్యారు. 
 
వీరిలో మహేష్, షకీల్, నాని తదితరులు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలివారు ఇంటివద్దనే ఉంటూ వైద్యం చేయించుకుంటున్నారు. ఈ విషయంపై స్థానిక ప్రభుత్వం ఏరియా ఆస్పత్రి ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ మీర్జానజీంబేగ్‌ను మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగానే వారికి వాంతులు విరేచనాలు అయినట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments