Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటుతో చనిపోయిన ప్రయాణికుడు.. బస్సులోనే మృతదేహాన్ని ఇంటికి చేర్చిన డ్రైవర్

Webdunia
ఆదివారం, 18 జూన్ 2023 (14:33 IST)
ఓ ప్రయాణికుడు గుండెపోటుతోనే బస్సులో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న బస్సు డ్రైవర్..  ప్రయాణికుడి మృతదేహాన్ని బస్సులోనే మృతుని ఇంటికి చేర్చి పెద్ద మనస్సు చాటుకున్నాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదుగుల గూడెంలో జరిగింది. 
 
తెలంగాణ స్టేట్ ఆర్టీసీ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. ఈ నెల 14వ తేదీన మహబూబాబాద్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్‌కు వెళుతోంది. ఈ బస్సులో ఉన్న ప్రయాణికుల్లో హుస్సేన్ అనే ప్రయాణికుడు మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందాడు. 108కు సమాచారం ఇచ్చి ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూశారు. తోటి ప్రయాణికులను విచారించగా, హుస్సేన్ కురవి మండలం మోదుగుల గూడెంగా చెప్పారు. 
 
ప్రయాణికుడు మరణించిన విషయాన్ని డ్రైవర్ డి.కొమురయ్య, కండక్టర్ కె.నాగయ్యలు ఉన్నతాధికారులకు చేరవేశారు. మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ సూచనతో అదే బస్సులో హుస్సేన్ మృతదేహాన్ని మోదుగుల గూడెంకు తరలించారు. సుమారు 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హుస్సేన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 
 
ఆర్టీసీ సిబ్బంది నిర్ణయాన్ని ఆ బస్సులోని ప్రయాణికులంతా ప్రశసించారు. ఈ విషయం ఎండీ వీసీ సజ్జనార్‌కు చేరింది. దీంతో డ్రైవర్, కండక్టర్‌లతో పాటు డిపో మేనేజరు విజయ్‌లను శనివారం బస్ భవన్‌కు పిలుపించుకుని ప్రత్యేకంగా అభినందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments