Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ క్లాస్ కోసం అమ్మాయికి ఐ ఫోన్ కొనిస్తే, అమ్మానాన్నలు బికేర్‌ఫుల్...

Webdunia
గురువారం, 17 సెప్టెంబరు 2020 (14:32 IST)
ఆన్‌లైన్ క్లాసుల కోసం మైనర్ బాలికకు సెల్ ఫోన్ ఇప్పించారు తల్లిదండ్రులు. అయితే ఆ బాలిక పేరెంట్స్‌కు తెలియకుండా సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్ క్రియేట్ చేసింది. ఆ యాప్‌లో ఇటీవలే ముగ్గురు యువకులు పరిచయం అయ్యారు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఆ తరువాత వారితో ఫోటోలు దిగి టిక్‌టాక్ వీడియోలు చేసింది.
 
అయితే ఆ బాలికను యువకులు ముగ్గురు బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టారు. తమకు డబ్బులు ఇవ్వాలని లేదంటే టిక్‌టాక్ వీడియోలు, ఫోటోలు వాట్సాప్‌లో పేరెంట్స్‌కు పంపిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో బాలిక వాడే ఐఫోన్ సైతం లాక్కున్నారు యువకులు.
 
తాము బైక్ కొనాలనుకుంటున్నామని అందుకు డబ్బులు ఇవ్వాలంటూ బెదిరించారు. చివరకు బాలిక మేనమామ ఈ విషయం పసిగట్టి పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
 
ముగ్గురు యువకుల్లో ఒకరు బైక్ మెకానిక్ కాగా, మరొక యువకుడు ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. పిల్లలు ఆన్‌లైన్ క్లాసులతో పాటు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని, పిల్లలు వాడే  మొబైల్ ఫోన్లను చెక్ చేస్తూ ఉండాలని తల్లిదండ్రలకు పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments