Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో మద్యం వద్దన్నందుకు దూకేశాడు.. అంతే మృతి

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (16:42 IST)
ఆస్పత్రిలో మద్యం తాగవద్దని చెప్పిన పాపానికి ఓ రోగి ఆస్పత్రి భవనం నుంచి కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఉస్మానియా ఆస్పత్రిలో చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం వీకర్‌ సెక్షన్‌ కాలనీకి చెందిన నాగరాజు (22) ఈ నెల రెండవ తేదీన పురుగులమందు తాగాడు. 
 
గమనించిన భార్య చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ నాగరాజు చికిత్స పొందుతున్నాడు. రోజూ చుక్కేసే ఆ మనిషికి.. ఆస్పత్రిలోనూ మందేయాలనిపించింది. 
 
అంతే ఆస్పత్రికి మద్యాన్ని తీసుకురావాలని భార్యను కోరాడు. ఆస్పత్రిలో మద్యం తాగొద్దని ఆమె వారించడంతో కోపంగా ఆమెను తోసేసి అక్కడి నుంచి వెళ్లాడు. 
 
కొద్దిసేపటి నాలుగో అంతస్థు నుంచి కిందకు దూకేశాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే  మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments