1 నుంచి తెలంగాణలో ఆన్‌లైన్‌ తరగతులు

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (08:30 IST)
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో డిజిటల్‌ తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. టీశాట్‌, దూరదర్శన్‌ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఆయా ఛానళ్లతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ఉపాధ్యాయులంతా ఈ నెల 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఆదేశించింది.
 
కరోనా పరిస్థితుల కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటి వరకు తెరుచుకోలేదు. గత కొన్ని రోజులుగా ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నాయి. మరికొన్నాళ్లు విద్యాసంస్థలు తెరిచే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది.

దీనిపై సుమారు నెలరోజుల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వాటిని పరిశీలించిన ప్రభుత్వం.. తాజాగా ఆన్‌లైన్‌ పాఠాలు చెప్పేందుకు విద్యాశాఖకు అనుమతించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: అద్భుతమైన నాన్న అంటూ శ్రుతిహాసన్ ఎమోషనల్ పోస్ట్

Virat Karna: శివాలయం సెట్‌లో విరాట్ కర్ణపై నాగబంధం సాంగ్ షూటింగ్

Kamal hasan: కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా అన్బరివ్ తో చిత్రం ప్రకటన

DiL Raju: హైదరాబాద్ లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ - దిల్ రాజు

Jatadhara review: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా చిత్రం జటాధర రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments