Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాదాద్రి జిల్లాలో ఘోరం... ప్రేమించలేదని యువతిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. వివరాల్లోకి వెళితే...

Webdunia
శనివారం, 10 జూన్ 2017 (17:38 IST)
ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి అనే యువతిని శ్రీకాంత్ అనే ప్రేమోన్మాది అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను సమీప భువనగిరి ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయింది. వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి డిగ్రీ చదువుతోంది. 
 
ఈమె కళాశాలకు వెళ్లే సమయంలో శ్రీకాంత్ అనే యువకుడు తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు. గత 6 నెలలుగా ఈ వేధింపులు సాగుతుండగా ఈమధ్యనే గాయత్రి తల్లిదండ్రులు అతడికి వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు కుమార్తె గాయత్రికి పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి కూడా కుదిరింది. మరో 10 రోజుల్లో నిశ్చితార్థం. 
 
విషయం తెలుసుకున్న శ్రీకాంత్ ఈరోజు మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేరని గ్రహించి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు వేసి వున్నా బద్ధలుకొట్టి లోనికి ప్రవేశించాడు. తలుపు చప్పుడు విని విద్యార్థిని సోదరుడు వచ్చేలోపుగానే ఆమెను విచక్షణరహితంగా పొడిచాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోగానే నేరుగా కత్తితో సహా భువనగిరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కాగా పెళ్లిపీటలెక్కాల్సిన తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన శ్రీకాంత్ ను కఠినంగా శిక్షించాలని గాయత్రి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

శేఖర్ కమ్ముల ఆణిముత్యాలు తీస్తున్నాడు; జాన్వి తో ఒక సినిమా చేస్తా : చిరంజీవి

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నవ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments