Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి... కాటికి పంపిన వైద్యులు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (08:49 IST)
కడపు నొప్పికి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు కాటికి పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విచిత్రమేమింటే.. ఆస్పత్రికి బాగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తికి వైద్యులు వేసిన ఓ ఇంజెక్షన్‌తో కేవలం గంటలోపే సదరు వ్యక్తి చనిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి కడుపునొప్పితో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ప్రాథమిక వైద్యానికి వచ్చాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేసి అతడికి ఇంజక్షన్ ఇచ్చారు. కానీ గంటలోపే ఆ వ్యక్తి కదల్లేని పరిస్థితి నెలకొంది. అనంతరం అతడు నొప్పితోనే చనిపోయాడు.
 
అయితే డాక్టర్లు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 
 
సీసీ ఫుటేజీ విడుదల చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

Powerstar: పవర్‌స్టార్‌ను అరెస్ట్ చేశారు.. బడా మోసం.. రుణం ఇప్పిస్తానని కోట్లు గుంజేశాడు..

క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి నవ్వుకున్నారు : విజయ్ సేతుపతి

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments