Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపు నొప్పితో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తి... కాటికి పంపిన వైద్యులు ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (08:49 IST)
కడపు నొప్పికి చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యక్తిని హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులు కాటికి పంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ విచిత్రమేమింటే.. ఆస్పత్రికి బాగా నడుచుకుంటూ వచ్చిన వ్యక్తికి వైద్యులు వేసిన ఓ ఇంజెక్షన్‌తో కేవలం గంటలోపే సదరు వ్యక్తి చనిపోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్లేష్ గౌడ్ అనే వ్యక్తి కడుపునొప్పితో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ప్రాథమిక వైద్యానికి వచ్చాడు. దీంతో వైద్యులు పరీక్షలు చేసి అతడికి ఇంజక్షన్ ఇచ్చారు. కానీ గంటలోపే ఆ వ్యక్తి కదల్లేని పరిస్థితి నెలకొంది. అనంతరం అతడు నొప్పితోనే చనిపోయాడు.
 
అయితే డాక్టర్లు ఇచ్చిన ఇంజక్షన్ వికటించడం వల్లే తమ కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. 
 
సీసీ ఫుటేజీ విడుదల చేయాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

తర్వాతి కథనం
Show comments