Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 28 ఆగస్టు 2022 (16:40 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా పని చేసే దేవేందర్ (19) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా వేల్పూరులో మంత్రికి క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడ దేవేందర్ ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నారు. ఈ కార్యాలయంలోని ఓ గదిలో దేవందర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. 
 
దేవందర్ ఉరేసుకున్న విషయాన్ని స్థానికులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఆర్మూర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. శవాన్ని స్వాధీనం చేసుకుని పంచనామాకు పంపించారు. 
 
కాగా, దేవేందర్‌ స్థానికంగా ఉండే ఓ మహిళతో సన్నిహితంగా ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. పైగా, ఆత్మహత్య చేసుకునేందుకు ముందు ఆ మహిళకు దేవేందర్ ఓ ఎస్ఎంఎస్ కూడా పంపినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఈ మహిళతో ఉన్న సన్నిహిత సంబంధంతో పాటు వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్యకు పాల్పడివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments