Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం వద్దు : టీ ఎంపీ వినోద్

Webdunia
బుధవారం, 20 ఆగస్టు 2014 (18:59 IST)
ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం వద్దనే వద్దని టీఆర్ఎస్ ఎంపీ బి వినోద్ కుమార్ మరోమారు స్పష్టం చేశారు. ఇదే అంశంపై హోం మంత్రి, ప్రధానమంత్రులతో సమావేశంకానున్నట్టు ఆయన బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. 
 
దీనిపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ హైదరాబాద్‌పై గవర్నర్‌కి అధికారాలు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు కల్పించవద్దని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నట్టు వెల్లడించారు. గురువారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు అందరూ రాజ్‌నాథ్ సింగ్‌ను కలవనున్నట్లు చెప్పారు. 
 
మరోవైపు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇంకా పరిష్కారం కాని కొన్ని అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్) భేటీ అయ్యారు. హైదరాబాదులోని సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇందులో ఉద్యోగుల విభజనలో కమలనాథన్ కమిటీ చేసిన సిఫార్సులను ఇరు రాష్ట్రాల సీఎస్‌లు ఆమోదించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments