తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తాం.. ఎపుడంటే....

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (13:52 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితులు లేవన్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే మాత్రం రాత్రిపూట కర్ఫ్యూ అవసరమన్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు. కానీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాజిటివిటీ రేటును నిశితంగా పరిశీలిస్తే ఒక్క జిల్లాలోనే ఇది 10 శాతంగా ఉందన్నారు. కరోనా కేసుతో పాటు పాజిటివిటీ రేటు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఈ నెల 31వ తేదీ వరకు ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో మెదక్‌లో 6.45 శాతం, కొత్తగూడెంలో 1.14 శాతం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 4.22 శాతం చొప్పున పాజిటివిటీ రేటు ఉందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments