Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తాం.. ఎపుడంటే....

Webdunia
మంగళవారం, 25 జనవరి 2022 (13:52 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాస రావు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితులు లేవన్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే మాత్రం రాత్రిపూట కర్ఫ్యూ అవసరమన్నారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందన్నారు. కానీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని పాజిటివిటీ రేటును నిశితంగా పరిశీలిస్తే ఒక్క జిల్లాలోనే ఇది 10 శాతంగా ఉందన్నారు. కరోనా కేసుతో పాటు పాజిటివిటీ రేటు పెరగకుండా ముందు జాగ్రత్తగా ఈ నెల 31వ తేదీ వరకు ఆంక్షలు విధించినట్టు ఆయన వివరించారు. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాల్లో మెదక్‌లో 6.45 శాతం, కొత్తగూడెంలో 1.14 శాతం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 4.22 శాతం చొప్పున పాజిటివిటీ రేటు ఉందని ఆయన వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments