Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట్లో విషాదం.. కాసేపట్లో ముహూర్తం.. అంతలోనే వధువు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (11:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేటలోని ఓ పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26)కు నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో మూహూర్తం. 
 
ఇంతలో పెళ్లి కుమార్తె తమ ఇంట్లోని స్టోర్ రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. యువతి ఉరికంబానికి వేలాడుతుండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాబోయే పెళ్లి కుమారుడు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో తమ కుమార్తెకు ఫోన్ చేశాడని, అతడు పెట్టిన మానసికక్షోభతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని యువతి తండ్రి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. 
 
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇటీవల జరిగే మెహందీ ఫంక్షన్‌లో ఎంతో ఉత్సాహంగా గడిపిన రవళి.. ఇంతలోనే శవమై కనిపించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments