Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింట్లో విషాదం.. కాసేపట్లో ముహూర్తం.. అంతలోనే వధువు ఆత్మహత్య

Webdunia
ఆదివారం, 11 డిశెంబరు 2022 (11:56 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవీపేటలోని ఓ పెళ్లింట విషాదం నెలకొంది. మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భాజాభజంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో ఆర్తనాదాలు మిన్నంటాయి. స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 
 
నవీపేటకు చెందిన ర్యాగల రవళి (26)కు నిజామాబాద్‌కు చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఆదివారం మధ్యాహ్నం 12.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో మూహూర్తం. 
 
ఇంతలో పెళ్లి కుమార్తె తమ ఇంట్లోని స్టోర్ రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. యువతి ఉరికంబానికి వేలాడుతుండటాన్ని గమనించిన తండ్రి పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి శవాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాబోయే పెళ్లి కుమారుడు శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో తమ కుమార్తెకు ఫోన్ చేశాడని, అతడు పెట్టిన మానసికక్షోభతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని యువతి తండ్రి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పెళ్లి కుమారుడిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు ఎస్ఐ తెలిపారు. 
 
మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉండగా, ఈ ఘటనతో బంధువులు, కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. ఇటీవల జరిగే మెహందీ ఫంక్షన్‌లో ఎంతో ఉత్సాహంగా గడిపిన రవళి.. ఇంతలోనే శవమై కనిపించడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేక పోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments