Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ కుమార్తె కవితపై వెయ్యి మంది రైతుల పోటీ

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (10:00 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కె.కవితపై వెయ్యి మంది రైతులు పోటీ చేయనున్నారు. ఈ మేరకు రైతుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కె.కవిత తెరాస అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. 
 
ఇపుడు ఈ స్థానం ఎన్నిక రసవత్తరంగా మారింది. దీనికి కారణం స్థానిక రైతులే. కవితపై పోటీ చేసేందుకు ఏకంగా వెయ్యిమంది సిద్ధమయ్యారు. కవితపై పోటీకి దిగబోతున్నవారందరూ రైతులు కావడం గమనార్హం. కవితపై తమ నిరసనను తెలిపేందుకు ఈ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.
 
పసుపు, ఎర్రజొన్నకు మద్దతు ధర కోసం డిమాండ్ చేస్తున్న వీరంతా కవితపై మూకుమ్మడిగా పోటీకి దిగాలని రైతు సంఘాలు తీర్మానించాయి. కనీసం 500 నుంచి వెయ్యి వరకు నామినేషన్లు దాఖలు చేయాలని రైతులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ ఎన్నిక రసవత్తరంగా మారనుంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments