Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారం రోజుల పసికందును రూ.3వేలకు అమ్మేసిన కన్నతల్లి!

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (17:13 IST)
ముక్కుపచ్చలారని ఆ పసికందును దారుణంగా మూడు వేల రూపాయలకు బేరం పెట్టింది ఓ కన్నతల్లి. ఈ అమానుష ఘటన హైదరాబాద్ నగరంలోని బాచుపల్లిలో వెలుగు చూసింది. రాధ అనే మహిళ తన భర్తతో కలిసి స్థానికంగా ఓ గుడిసెలో నివాసం ఉంటున్నారు.
 
కూలీపని చేసుకుంటూ బ్రతికే ఈ దంపతులకు ఏడు రోజుల క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఏమైందో ఏమో కానీ భూమి మీదపడిన మూడు రోజులకే చిన్నారిని స్థానికంగా ఉన్న శాంతమ్మ అనే మహిళకు రూ.3 వేలకు విక్రయించింది. ఆ తర్వాత మరో మూడు రోజులకు మళ్ళీ తన బిడ్డ తనకు కావాలని చిన్నారిని కొనుకున్న మహిళా వద్దకు వెళ్లి తన బిడ్డను తిరిగి ఇచ్చేయాలని కోరింది.
 
కానీ అందుకు ఆ మహిళ ఒప్పుకోలేదు. కన్న తల్లి బ్రతిమాలడంతో పదివేల రూపాయలిస్తే బిడ్డను తిరిగిచ్చేస్తాని చెప్పింది. దీంతో అంత డబ్బు ఇవ్వలేని ఆ తల్లి దిక్కు తోచని స్థితిలో రాధ స్థానిక అంగన్‌వాడీ టీచర్‌ను ఆశ్రయించింది. అంగన్‌వాడీ టీచర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు శిశువును సంరక్షణలోకి తీసుకొని విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments