Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు!

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:05 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే ఈ భవనాన్ని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలను ఆహ్వానించనున్నారు. వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తదితరులను ఆహ్వానించనున్నారు. 
 
నిజానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 17వ తేదీన జరుగనున్నాయి. ఆ రోజున ఈ సచివాలయ కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఇందులోభాగంగా, అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీని ప్రారంభించాలని ముహూర్తంగా ఖరారు చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
 
అలాగే, ముందుగా అనుకున్నట్టు ఈ ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇపుడు ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. అదేసమయంలో ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments