Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు!

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2023 (08:05 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ముహూర్తాన్ని ఖరారు చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజునే ఈ భవనాన్ని ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఈ ప్రారంభోత్సవానికి దేశంలోని వివిధ పార్టీలకు చెందిన పలువురు హేమాహేమీలను ఆహ్వానించనున్నారు. వీరిలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, జేడీయూ నేత అలన్ సింగ్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ తదితరులను ఆహ్వానించనున్నారు. 
 
నిజానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఈ నెల 17వ తేదీన జరుగనున్నాయి. ఆ రోజున ఈ సచివాలయ కొత్త భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఈ తేదీపై అనేక విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం కొత్త తేదీని ఖరారు చేసింది. ఇందులోభాగంగా, అంబేద్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14వ తేదీని ప్రారంభించాలని ముహూర్తంగా ఖరారు చేసినట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం.
 
అలాగే, ముందుగా అనుకున్నట్టు ఈ ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇపుడు ముహూర్తం మారిన నేపథ్యంలో ఈ సభ ఉంటుందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేదు. అదేసమయంలో ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తుంది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments