Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రమాద చిన్నారుల మృతులపై స్పష్టత ఇవ్వని అధికారులు!

Webdunia
గురువారం, 24 జులై 2014 (15:03 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట సమీపంలో గురువారం ఉదయం స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ప్రమాదంలో... ఎంతమంది చిన్నారులు మరణించారన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సు డ్రైవర్, క్లీనర్‌తో పాటు 13 మంది పిల్లలు చనిపోయారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఘటనా స్థలం నుంచి అందిన సమాచారం మేరకు 20 మంది చిన్నారులు చనిపోయినట్లు తెలుస్తోంది. 
 
గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరికొంతమంది తుదిశ్వాస విడిచారు. మరో 23 మంది పిల్లలు సికింద్రాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత బస్సులో 30 మంది చిన్నారులున్నారని వార్తలొచ్చాయి. కానీ, ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం బస్సులో 40 మందికి పైగా పిల్లలున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదిలావుండగా, శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు విద్యార్థులు మృత్యువాత పడటంతో... సంతాప సూచకంగా సెలవు ప్రకటించినట్టు డీఈవో తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని... స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments