Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి హరికృష్ణ తనయకు కూకట్‌పల్లి సీటు.. 17న నామినేషన్

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (09:16 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేయనున్నారు. ఈమెకు కూకట్‌పల్లి టిక్కెట్‌ను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేటాయించారు. 
 
నిజానికి ఈ స్థానం నుంచి సుహాసిని పోటీ చేసే అంశంపై రెండు రోజుల పాటు తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈనేపథ్యంలో గురువారం చంద్రబాబును వైజాగ్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు టిక్కెట్ ఖరారు చేశారు. సుహాసిని విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటూ ఆ సెగ్మెంట్‌కు చెందిన టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. దీంతో శనివారం ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. 
 
కాగా, హరికృష్ణ కుమార్తె సుహాసిని తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ సతీమణి. పిల్లల చదువుల కోసం సుహాసిని హైదరాబాద్ నగరంలో కొన్నేళ్లుగా స్థిరపడిపోయారు. హరికృష్ణ ఆకస్మిక మరణం తర్వాత ఆయన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ఆమెకు పార్టీ టిక్కెట్ కేటాయించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments