Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నాగసాధువుల శాపాల దాడి... వణికిపోతున్న ఛోటా నాయకులు

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (19:33 IST)
బాబాల శృంగార కార్యకలాపాలు ఈ మధ్య వార్తల్లో వీర విహారం చేసాయి. అదేవిధంగా ఇప్పుడు మరికొంత మంది కొత్త తరహాలో నాగసాధువులమంటూ ప్రజా ప్రతినిధులపై విరుచుకుపడుతున్నారు. మాట వినకపోతే శపిస్తామని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరు సాధువులు వివిధ బృందాలుగా ఏర్పడి సంచరిస్తున్నారు. 
 
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామాల వెంబడి తిరుగుతూ సర్పంచ్‌ల ఇంటికి నేరుగా వెళుతున్నారు. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. పలు పూజలు చేయాలని, చేయకపోతే అరిష్టం అని భయపెడుతున్నారు. కొందరు ఏమీ చేయలేక ఐదు వందలు, వెయ్యి రూపాయలు ముట్టజెపుతున్నారు. తాము నేరుగా కుంభమేళా నుంచి వస్తున్నామని తాము చెప్పినట్లు వినాలని ఆదేశిస్తున్నారు. వినకపోతే శపిస్తామని బెదిరిస్తున్నారు. 
 
కొందరు తిరస్కరించి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని చెబుతున్నా వినడం లేదు. బాధితులు అసహనంతో పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు రంగంలోకి దిగారు. పలు బృందాలను అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు చెప్పిన మాటలకు కొంతమంది సర్పంచ్‌లు ఆందోళన చెందుతూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments