Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో నాగసాధువుల శాపాల దాడి... వణికిపోతున్న ఛోటా నాయకులు

Webdunia
శుక్రవారం, 15 ఫిబ్రవరి 2019 (19:33 IST)
బాబాల శృంగార కార్యకలాపాలు ఈ మధ్య వార్తల్లో వీర విహారం చేసాయి. అదేవిధంగా ఇప్పుడు మరికొంత మంది కొత్త తరహాలో నాగసాధువులమంటూ ప్రజా ప్రతినిధులపై విరుచుకుపడుతున్నారు. మాట వినకపోతే శపిస్తామని హెచ్చరిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో కొందరు సాధువులు వివిధ బృందాలుగా ఏర్పడి సంచరిస్తున్నారు. 
 
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లను లక్ష్యంగా చేసుకున్నారు. గ్రామాల వెంబడి తిరుగుతూ సర్పంచ్‌ల ఇంటికి నేరుగా వెళుతున్నారు. డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు. పలు పూజలు చేయాలని, చేయకపోతే అరిష్టం అని భయపెడుతున్నారు. కొందరు ఏమీ చేయలేక ఐదు వందలు, వెయ్యి రూపాయలు ముట్టజెపుతున్నారు. తాము నేరుగా కుంభమేళా నుంచి వస్తున్నామని తాము చెప్పినట్లు వినాలని ఆదేశిస్తున్నారు. వినకపోతే శపిస్తామని బెదిరిస్తున్నారు. 
 
కొందరు తిరస్కరించి తమకు ఎలాంటి పూజలు అవసరం లేదని చెబుతున్నా వినడం లేదు. బాధితులు అసహనంతో పోలీసుల దృష్టికి తీసుకు వెళ్లగా వారు రంగంలోకి దిగారు. పలు బృందాలను అదుపులోకి తీసుకున్నారు. కానీ వారు చెప్పిన మాటలకు కొంతమంది సర్పంచ్‌లు ఆందోళన చెందుతూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments