Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయీమ్ ఆస్తుల విలువ రూ. 2 వేల కోట్లు

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (08:22 IST)
గ్యాంగ్ స్టర్ నయీమ్ కు 2 వేల కోట్ల విలువైన ఆస్తులున్నాయని సిట్ వెల్లడించింది. తెలంగాణ, ఏపీలతో పాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో ఈ ఆస్తున్నాయని తెలిపింది. వేయి 15 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు అధికారులు.

లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాలతో పాటు  మొత్తం 29 భవనాలు ఉన్నాయి. 1.90 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 2.8 కోట్ల నగదు, 258 సెల్ ఫోన్లు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాలున్నాయని సిట్ వివరించింది. మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్దనున్న మిలినియం టౌన్ షిప్‌లో తలదాచుకున్న నయీమ్  2016, ఆగస్ట్ 8వ తేదిన  పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమయ్యాడు.

ఈ కేసును అప్పటి నుంచి విచారణ జరుపుతున్నది. తాజాగా కేసు ఐటీ శాఖకు చేరింది. నయీమ్ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని పోలీసులకు సూచించింది. బినామీల పేరిట ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లు గుర్తించారు.

ఈ కేసులో అరెస్టయి..బెయిల్‌పై బయటకు వచ్చిన నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారిస్తున్నారు. ఆస్తులను ఎలా కూడబెట్టారు ? తదితర వివరాలను ప్రశ్నిస్తున్నారు. కానీ టైలరింగ్, బట్టల వ్యాపారం ద్వారా ఆస్తులు సంపాదించడం జరిగిందన్న వ్యాఖ్యలను ఐటీ అధికారులు నమ్మడం లేదని తెలుస్తోంది.

వేల కోట్ల రూపాయలు కూడబెట్టిన నయీమ్ ఐటీ చెల్లింపులు చేశారా ? లేదా ? అనేదానిని ఆరా తీస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments