ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి.. ఓటమిని అంగీకరించారా?

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2022 (11:31 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో అమిత ఉత్కంఠతను రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రౌండ్ రౌండ్‌కు సరళి మారిపోతుంది. ఇప్పటివరకు వెల్లడైన నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, అధికార తెరాస నేత కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కంటే వెనుకబడివున్నారు. దీంతో ఆయన ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 
 
మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగాల్సివుండగా, ఇప్పటివరకు నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తికాగానే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. రెండో రౌండ్ పూర్తికాగానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి పాల్వాయి స్రవంతి ఇంటికి వెళ్లిపోయారు. ఇపుడు బీజేపీ అభ్యర్థి కూడా వెళ్లిపోవడంతో వీరిద్దరూ ఓట్ల లెక్కింపు పూర్తికాకముందే తమ ఓటమిని అంగీకరించినట్టు ఉన్నారనే ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments