Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోత్కుపల్లికి బంపర్ ఆఫర్.. గవర్నర్ గిరి.. బాబుకు సమాచారం!

Webdunia
ఆదివారం, 26 ఏప్రియల్ 2015 (14:50 IST)
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఆయనకు గవర్నర్ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను త్వరలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమించవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ విషయమై సమాచారం ఇచ్చినట్టు సమాచారం. 
 
టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు నేపథ్యంలో అటు కేంద్రంతో పాటు ఇటు ఏపీలో పదవులను పంచుకోవాలన్న రెండు పార్టీల నిర్ణయం మేరకే మోత్కుపల్లికి గవర్నర్ గిరి దక్కనుంది. గడచిన ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపని మోత్కుపల్లి, తనను రాజ్యసభ సభ్యుడిగా పంపాలని చంద్రబాబును కోరిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఎన్డీఏ అధికారంలోకి వస్తే, గవర్నర్ పదవి ఇప్పిస్తానన్న చంద్రబాబు హామీతో రాజ్యసభ సీటు డిమాండ్‌ను మోత్కుపల్లి విరమించుకున్నారు. అనుకున్నట్లుగానే ఎన్డీఏ అధికారంలోకి రావడం అటు కేంద్రంలోనే కాక, ఇటు ఏపీలోనూ రెండు పార్టీల నేతలకు పదవుల పంపిణీ జరిగిపోయింది. ఈ క్రమంలోనే మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కనుంది. అయితే, ఏ రాష్ట్రానికి మోత్కుపల్లి గవర్నర్‌గా వెళతారనే విషయం త్వరలోనే తేలిపోనుంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments