Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానని ఆషామాషీగా చెప్పలేదు : ఈటల రాజేందర్

Webdunia
సోమవారం, 16 అక్టోబరు 2023 (13:43 IST)
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తాను పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు ఆషామాషీగా చేయలేదని మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా, జమ్మికుంటలో కేంద్ర రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ బహిరంగ సభ జరుగనుంది. ఇందుకోసం జరుగుతున్న ఏర్పాట్లను ఈటల సోమవారం పరిశీలించారు.
 
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, దమ్ముంటే ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలంటూ ఇటీవల మంత్రి గంగుల కమలాకర్‌ చేసిన సవాల్‌పై ఆయన స్పందించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో తనను ఓడించేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి దౌర్జన్యం చేసినా.. అధికార యంత్రాంగం మొత్తాన్ని తనపై కేంద్రీకరించినా గెలిచానని వివరించారు. ఆ ఉపఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను ఓడించటమే తన లక్ష్యమన్నారు. ఆ మేరకే గజ్వేల్‌ నుంచి పోటీ చేయనున్నట్టు ఈటల స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలను తాను అంత ఆషామాషీగా చేయలేదని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments