Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ.. కేటీఆర్ పిలుపు

Webdunia
శుక్రవారం, 27 ఆగస్టు 2021 (16:36 IST)
తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించాలని కార్యకర్లకు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 
 
సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నారు. 
 
సెప్టెంబర్ 2న జెండా పండుగతో పాటు గ్రామ కమిటీలు, వార్డు కమిటీల నిర్మాణం చేయాలని సూచించారు. అదే రోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు.
 
సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు గ్రామ, వార్డు కమిటీల ప్రక్రియ నిర్వహించాలని, సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ లోపు మండల కమిటీలు,పట్టణ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పారు.
 
వీటి తర్వాత ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు సమక్షంలో జిల్లా అధ్యక్షుడు, కార్యవర్గం ఎంపిక ఉంటుందని వివరించారు. సెప్టెంబర్ 20 తర్వాత రాష్ట్ర కార్యవర్గం ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. 
 
సెప్టెంబర్ ఆఖరులోపు ఈ కమిటీల నియామకాన్ని పూర్తి చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌లో 150 డివిజన్ల కు 150 డివిజన్ కమిటీలు ఉంటాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments