Webdunia - Bharat's app for daily news and videos

Install App

25న తెరాస అధ్యక్షుడి ఎన్నిక : వెల్లడించిన మంత్రి కేటీఆర్

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడి ఎన్నిక ఈ నెల 25వ తేదీన జరుగనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడించారు. పార్టీ నియమావళి మేరకు రెండేళ్లకోసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులోభాగంగానే ఈ నెల 25వ తేదీన ఎన్నిక నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 17 నుంచి 22 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుందన్నారు.  23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ చేపడతామని చెప్పారు. 25న తెరాస అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. 
 
నవంబర్‌ 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేటీఆర్‌ తెలిపారు. ఈనెల 27న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీనికి సంబంధించిన సన్నాహక సభలు నిర్వహిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన కాజల్ అగర్వాల్ సత్యభామ

ఆ హీరోతో ఆగిపోయిన టైటిల్ కళ్యాణ్ రామ్ కు పెడుతున్నారా?

ప్రభాస్ "కల్కి" ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.191.5 కోట్లు!!

కల్కి 2898 AD చిత్రం మొదటి రోజు కలెక్షన్ ఇదే

ఏపీలో విజయం తెలంగాణపై ఉంటుంది - తెలంగాణ లో పవన్ కళ్యాణ్ పర్యటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చర్మ సౌందర్యానికి జాస్మిన్ ఆయిల్, 8 ఉపయోగాలు

రాగులు ఎందుకు తినాలో తప్పక తెలుసుకోవాలి

ఆరోగ్యానికి మేలు చేసే 7 ఆకుకూరలు, ఎలా?

అపెండిక్స్ క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేసిన విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ కానూరు

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments