Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని మహిళను కూడా వదలరా? రెండుసార్లు తల్లి అయ్యింది..

Webdunia
సోమవారం, 8 మార్చి 2021 (10:25 IST)
మహిళలపై అకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మతిస్థితిమితం లేని మహిళలను కూడా మృగాళ్లు వదలడం లేదు. తాజాగా మతిస్థిమితం లేని ఓ మహిళపై లైంగిక దాడి చేసి బిడ్డకు తల్లిని చేసిన ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో వెలుగుచూసింది. అది కూడా మూడోసారి కావడం సమాజంలో పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకోవచ్చు.
 
వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లాలోని కోస్గి పట్టణంలో ఓ మహిల చిచ్చమెత్తుతూ రోడ్లపైనే జీవనం సాగిస్తుంది. ఆమె తల్లిదండ్రులు చనిపోగా.. అన్న ఆమెను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మతిస్థిమితం కోల్పోయింది. అయితే అలాంటి మహిళకు కొందరు మృగాళ్లు పాడు బుద్దిని ప్రదర్శించారు. ఆమెపై లైంగికదాడులకు పాల్పడి ఇప్పటికే రెండుసార్లు తల్లిని చేశారు. తాజాగా ఆదివారం బస్టాండ్‌ సమీపంలోని పెట్రోల్‌బంకు వెనుక నిర్మాణంలో ఉన్న భవనంలో ఆమె పురిటి నొప్పులతో బాధపడటం గమనించిన స్థానికులు వైద్యులకు సమాచారం అందించారు.
 
దీంతో అక్కడికి చేరుకున్న ప్రభుత్వ వైద్యురాలు ఆమెకు ప్రసవం చేసింది. ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన తర్వాత ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇక, ఆ బిడ్డను తమ ఆధీనంలోకి తీసుకున్న అంగన్‌వాడీ సిబ్బంది. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని చైల్డ్ కేర్ హోమ్‌కు అప్పగించారు. గతంలో ఆ మహిళకు జన్మించిన ఇద్దరు బిడ్డలను కూడా అక్కడికే తరలించినట్టుగా తెలిసింది. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాధిత మహిళకు రక్షణ కల్పించాలని అధికారులను కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

Rukmini Vasanth: ఎస్కే, రిషబ్, యష్, ఎన్టీఆర్‌తో రుక్మిణి వసంత్ సినిమాలు.. పాన్ ఇండియా హీరోయిన్‌గా?

Prabhas and Anushka: ప్రభాస్‌తో కలిసి నటిస్తాను అంటోన్న దేవసేన (video)

Krish: పవన్ కళ్యాణ్ అంటే అభిమానమే.. - ఇప్పుడు సినిమా లైఫ్ మూడు గంటలే : క్రిష్ జాగర్లమూడి

అథర్వా మురళి నటించిన యాక్షన్ థ్రిల్లర్ టన్నెల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం