Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేకే ఏపీ రాజ్యసభ సభ్యుడు... తెలంగాణలో ఎలా ఓటేస్తారు?

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (14:31 IST)
కేకేపై వెంకయ్యనాయుడికి భాజపా నేతలు ఫిర్యాదు చేశారు. ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు.

తెరాస మున్సిపల్​ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడిని లక్ష్మణ్​ నేతృత్వంలోని బృందం దిల్లీలో కలిసింది. తెరాస రాజ్యసభ ఎంపీ కేశవరావుపై భాజపా నేతలు ఫిర్యాదు చేశారు.

ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకేకు మున్సిపల్​ ఎన్నికల్లో ఎక్స్​ అఫీషియో కింద ఓటుహక్కు కల్పించడంపై వెంకయ్యనాయుడికి తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని తెరాస ఖూనీ చేసిందని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మండిపడ్డారు. ఏపీ రాజ్యసభ ఎంపీ కేశవరావుకు ఎలా ఓటు కల్పిస్తారని ప్రశ్నించారు. తుక్కుగూడలో భాజపాకు పూర్తి మెజారిటీ వచ్చినా అక్రమంగా తెరాస సభ్యులు గెలిచారని ఆరోపించారు.

కేకేపై చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడుకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. రాజ్యసభ ఎథిక్స్ కమిటీకి పంపించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని రాజ్యసభ ఛైర్మన్ చెప్పారని లక్ష్మణ్​ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments