Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృత్యువుతో 5 రోజులుగా పోరాడి కన్నుమూసిన మెడికో ప్రీతి

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (22:47 IST)
వరంగల్‌ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి రాత్రి 9 గంటల 10 నిమిషాలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. అంతకుముందు ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు తెలిపారు. ప్రీతి మృతిపై నిమ్స్ వైద్యులు ప్రకటన చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.
 
అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే వుందని ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 
 
కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సీనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె గత ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆదివారం రాత్రి ఆమె కన్నుమూసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments