Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిని చంపేందుకు ఇంటికి నిప్పు పెట్టిన కుమారుడు... తర్వాత ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 16 మే 2023 (15:15 IST)
కన్నతల్లిని చంపేందుకు ఓ కిరాతక కుమారుడు సొంత ఇంటికే నిప్పుపెట్టాడు. కొద్దిసేపటి తర్వాత తన తల్లి బయట నుంచి రావడాన్ని చూసి విస్తుపోయి, అక్కడ నుంచి పారిపోయాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో జరిగింది. 
 
బీర్కూరుకు చెందిన గువ్వల చంద్రవ్వ, నారాయణ దంపతులకు ఒకే కుమారుడు ఉన్నాడు. ఈయన పేరు అశోక్. గతంలోనే నారాయణ చనిపోయాడు. అశోక్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. తల్లి చంద్రవ్వ మాత్రం బీర్కూరులో ఉంటుంది. అశోక్ నిత్యం డబ్బులు కోసం చంద్రవ్వను వేధించేసాగాడు. 
 
తల్లిపేరిట ఉన్న ఆస్తిని తన పేరుమీద రాయాలని గొడవ చేసేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం బీర్కూరుకు అశోక్ చేరుకుని, తల్లి ఇంటి ఉందని భావించి పైకప్పుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ సమయంలో తల్లి చంద్రవ్వ బయట నుంచి రావడాన్ని చూసిన అశోక్ అక్కడ నుంచి పారిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments