Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోనాలకు భార్య రాలేదని.. భర్త ఆత్మహత్య

Webdunia
సోమవారం, 15 ఆగస్టు 2022 (10:47 IST)
బోనాలకు భార్య రాలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యతో వీడియో కాల్‌లో మాట్లాడుతూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇది రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తుక్కుగూడకు చెందిన సాయి కార్తీకి గౌడ్ (33) అనే వ్యక్తి భార్య రవళితో కలిసి ఈ నెల 12వ తేదీన బంధువుల ఇంట్లో జరిగే వివాహం కోసం కందుకూరు మండలం బేగంపేటకు వెళ్లాడు. వివాహం తర్వాత భార్యను అక్కడే వదిలిపెట్టి ఇంటికి వచ్చాడు. 
 
అయితే, శనివారం మీర్‌పేట్‌లో బోనాలు జరిగాయి. ఈ బోనాలు పండుగ చేసుకునేందుకు తన పిన్ని ఇంటికి వెళ్దామని, అందువల్ల తక్షణం రావాలంటూ భార్యకు ఫోన్ చేశాడు.
 
అయితే, ఆమె ఎన్నిసార్లు ఫోన్లు చేసినా పట్టించుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కార్తీక్ గౌడ్... భార్యకు వీడియో కాల్ చేసి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ, భార్య చూస్తుండగానే ఇంటి దూలానికి ఉరివేసుకున్నాడు. ఆ వెంటనే రవళి తమ పక్కింటికి ఫోన్ చేసి తన భర్తను రక్షించాలని వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 
 
ఆమె ఇంటికి చేరుకునే సమయానికి భర్త శవమైపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామాకు పంపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments