Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్థరాత్రి భార్యతో రాసలీలలు.. కళ్లారా చూసిన భర్త ఏం చేశాడంటే?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (13:46 IST)
మహిళలపై అకృత్యాలు ఓవైపు.. మరోవైపు వివాహేతర సంబంధాలు. దీంతో నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడిని ఆమె భర్త రాడ్డుతో కొట్టి దారుణంగా హతమార్చాడు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆర్యనగర్‌లో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. నాగారం గ్రామానికి చెందిన సాల్మన్‌ రాజు (24) ఏడాదిగా స్థానికంగా ఓ అపార్ట్‌మెంట్‌లో ప్లంబర్‌ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితతో సాల్మన్‌ రాజు రాసలీలలు సాగిస్తూ ఆమె భర్త ఉమాకాంత్‌ కంటపడ్డాడు.
 
దీంతో రగిలిపోయిన ఉమాకాంత్‌ పక్కనే ఉన్న రాడ్డుతో సాల్మన్‌ రాజు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఉమాకాంత్‌ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments