ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో..?

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (20:15 IST)
ప్రేమించిన యువ‌తి పెళ్లికి నిరాక‌రించింద‌నే కోపంతో ఓ ప్రియుడు త‌న ప్రియురాలిని క‌త్తితో గొంతు కోసి హ‌త్య చేసిన ఘటన రామ‌గిరి మండల ప‌రిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కేకే న‌గ‌ర్‌కు చెందిన గొడుగు అంజ‌లి(18), రాజు(22) అనే యువ‌కుడు గ‌త మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. 
 
అయితే అంజ‌లి డిగ్రీ చ‌దువుతుండ‌గా, రాజు 8-ఇంక్లైన్ కాల‌నీలో ట్రాక్ట‌ర్ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని రాజు.. అంజ‌లిపై గ‌త కొద్ది రోజుల నుంచి ఒత్తిడి తీసుకొచ్చాడు. డిగ్రీ అయిపోయాక పెళ్లి చేసుకుందామ‌ని అంజ‌లి రాజుకు స‌ర్దిచెప్పింది.
 
ఇప్పుడే పెళ్లి చేసుకోవాల‌ని రాజు ఒత్తిడి తేవ‌డంతో.. ఇటీవ‌ల వీరిద్ద‌రి మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ కూడా చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం సాయంత్రం అంజ‌లి ఇంటికి చేరుకున్న రాజు.. ఆమె గొంతును క‌త్తితో కోసి హ‌త్య చేసి పారిపోయాడు. ఈ హ‌త్య ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కేన్స్‌లో షాకింగ్ ఘటన... మిస్ వెనిజులాపై స్టైలిస్ట్ కత్తెరతో దాడి.. ముఖంపై రక్తంతో.. వీడియో

Shruti Haasan: హెల్లాల్లో స్టెప్‌లతో అలరించిన రామ్ చరణ్, శ్రుతిహాసన్

మేము కాప్’లం 17 రోజుల్లోనే తీశారంటే నమ్మలేకపోయా : బండ్ల గణేష్

Satyadev: యముడిలా కనుమరుగు చేసే సమవర్తి పాత్రలో సత్యదేవ్

Payal Rajput: శౌరవ్ ను హగ్ చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పిన పాయిల్ రాజ్ పుత్

తర్వాతి కథనం
Show comments