Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలిని అనుమానం చంపి సంపులో పడేశాడు.. చివరికి ఆత్మహత్య చేసుకోవాలని..?

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:36 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అనుమానాలతో ప్రాణాలు తీసే దుర్మార్గుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా వరుసకు బావయ్యే ఓ యువకుడు అనుమానంతో మరదలి గొంతు నులిమి హత్య చేశాడు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఈనెల 10న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
వివరాల్లోకి వెళ్తే.. మూసాపేట హబీబ్‌నగర్‌కు చెందిన సోమేశ్వరరావు, నీలమ్మ దంపతుల చిన్న కుమార్తె మంజుల (19) నగరంలో బీటెక్‌ చదువుతోంది. కూకట్‌పల్లి ఏవీబీ పురానికి చెందిన ఢిల్లేశ్వరరావు చిన్న కుమారుడు భూపతి ఈమెకు వరుసకు బావ అవుతాడు. సమీప బంధువులు కావడంతో పెద్దలు వీరికి వివాహం చేయాలని గతంలోనే నిర్ణయించారు.
 
అయితే మంజుల తనను దూరం పెట్టి ఇతర యువకులతో సన్నిహితంగా ఉంటోందని భావించిన భూపతి.. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 10న ఎవరూ లేని సమయంలో మంజులను తన ఇంటికి పిలిచాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశానికి గురైన భూపతి.. మరదలి గొంతు నులిమి హతమార్చాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడేశాడు. 
 
ఆపై తానూ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా.. ధైర్యం చాలకపోవడంతో అదే రోజు కూకట్‌పల్లి ఠాణాకు వచ్చి లొంగిపోయినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments