Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చనిపోమన్నాడు.. కట్నం కోసం రెండో పెళ్లి చేసుకుంటానన్నాడు.. చివరికి?

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (10:22 IST)
వరకట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేశాడు ఓ భర్త. అది కూడా పుట్టింటి నుంచి డబ్బు తేవాలని ఒత్తిడి చేయలేదు. భార్యను చనిపోవాలని.. ఆమె చనిపోతే మరో యువతిని పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. 
 
భార్యను చావమని వేధించి నరకం చూపించాడు. ఆమె చనిపోతే.. భారీగా కట్నం వస్తుందని భర్త చిత్రహింసలకు గురిచేశాడు. భర్త చిత్రహింసలు తాళలేక ఆ మహిళ భర్త నుంచి తప్పించుకుని స్వదేశం చేరుకుని పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ మండలానికి చెందిన 32 ఏళ్ల యువతి శంకరపల్లి మండలం మహాలింగపురానికి చెందిన ప్రవీణ్ రెడ్డితో 2017లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. పెళ్లయిన దంపతులు అమెరికాకు వెళ్లారు. వారికి ఓ బాబు కూడా వున్నాడు. 
 
కొంతకాలం అదనపు కట్నం కోసం ప్రవీణ్ రెడ్డి భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. అదనపు కట్నం ఇవ్వకపోవడంతో పలుమార్లు దాడి చేసి ఆమెకు భోజనం, మంచినీళ్లు ఇవ్వకుండా గదిలో బంధించాడని పోలీసుల ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments