Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:20 IST)
అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది. ఇదేంటి.. పానీ పూరీ తినడం వల్ల ప్రాణం పోయిందా అనుకునేరు. కాదు.. పానీపూరి బండి వద్ద జరిగిన గొడవలో గాజు గ్లాసు పగిలి ఓ వ్యక్తి చేతికి తీవ్రంగా గాయమైంది. ఆస్పత్రికి తరలించే లోపు ఏకధాటిగా రక్తం కారడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఠానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పహాడీషరీఫ్ తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్ (28) బుధవారం రాత్రి పది గంటలకు.. మద్యం మత్తులో బైకును నడిపాడు. ఈ బైకు కాస్త చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లింది. మద్యం మత్తులో వున్న వ్యక్తి.. పానీపూరీ కావాలని అడగడంతో ఆ పానీపూరీ అమ్మేవాడు లేదని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ అతనితో ఘర్షణకు దిగాడు. ఇదేంటని అక్కడే వున్నయాదయ్య అనే వ్యక్తి.. వారిద్దరి గొడవను ఆపాలని చూశాడు. 
 
ఆవేశంలో పానీపూరి బండిపై వున్న గాజుపై గట్టిగా శ్రీనివాస్ బాదాడు. దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్‌ కుడిచేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో బాగా ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే చాలా రక్తంపోవడంతో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments