అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది..

Webdunia
శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (14:20 IST)
అవును.. పానీ పూరీ ప్రాణం తీసింది. ఇదేంటి.. పానీ పూరీ తినడం వల్ల ప్రాణం పోయిందా అనుకునేరు. కాదు.. పానీపూరి బండి వద్ద జరిగిన గొడవలో గాజు గ్లాసు పగిలి ఓ వ్యక్తి చేతికి తీవ్రంగా గాయమైంది. ఆస్పత్రికి తరలించే లోపు ఏకధాటిగా రక్తం కారడంతో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఠానాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. పహాడీషరీఫ్ తుక్కుగూడకు చెందిన కట్టెల శ్రీనివాస్ (28) బుధవారం రాత్రి పది గంటలకు.. మద్యం మత్తులో బైకును నడిపాడు. ఈ బైకు కాస్త చౌరస్తాలోని పానీ పూరి బండి వద్దకు వెళ్లింది. మద్యం మత్తులో వున్న వ్యక్తి.. పానీపూరీ కావాలని అడగడంతో ఆ పానీపూరీ అమ్మేవాడు లేదని చెప్పాడు. దీంతో శ్రీనివాస్ అతనితో ఘర్షణకు దిగాడు. ఇదేంటని అక్కడే వున్నయాదయ్య అనే వ్యక్తి.. వారిద్దరి గొడవను ఆపాలని చూశాడు. 
 
ఆవేశంలో పానీపూరి బండిపై వున్న గాజుపై గట్టిగా శ్రీనివాస్ బాదాడు. దీంతో అక్కడ ఉన్న గాజు గ్లాసు పగిలి శ్రీనివాస్‌ కుడిచేతి నరానికి తగిలి తీవ్రగాయమైంది. గాజు ముక్కలు గాయంలో బాగా ఇరుక్కుపోవడంతో రక్తం ధారలా కారింది. వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే చాలా రక్తంపోవడంతో శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raghav Juyal: నాని ప్యారడైజ్ లో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ప్రవేశం

Prabhas: రాజా సాబ్ ట్రైలర్ కు రెస్పాన్స్ - యూరప్ లో ప్రభాస్ తో రెండు పాటల చిత్రీకరణ

Suman: రెగ్యులర్ షూటింగ్ లో ఉదయ భాస్కర వాగ్దేవి డైరెక్టన్ లో మహానాగ

రిషికేష్‌కు రజినీకాంత్, రోడ్డు పక్కన రాతి బెంచీపై ప్లేటులో భోజనం చేస్తూ...

Raviteja: రవితేజ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments