Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిట్టాడనీ వ్యక్తి మర్మాంగాన్ని కోసేశాడు...

Webdunia
గురువారం, 24 జూన్ 2021 (07:45 IST)
తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనను తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 
 
పొలీసుల కథనం ప్రకారం హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై చిల్లర సామాన్లు విక్రయిస్తుంటాడు. ఐదు రోజుల క్రితం కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి వలస వచ్చి స్థానికంగా శిథిలమైన ఓ భవనంలో నివసిస్తున్నాడు. 
 
అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం మద్యం మత్తులో కార్తీక్‌ను దూషించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఘర్షణ మరింత పెరగడంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్.. పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు. 
 
ఆ తర్వాత ‘డయల్ 100’కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments