Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం.. సౌదీ వ్యక్తి అరెస్ట్

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (13:24 IST)
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై గతంలో వార్తలు వెల్లువెత్తాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఎందుకున్నారంటూ విపక్ష నేతలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఆపై సద్దుమణిగినా.. మళ్లీ కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్‌ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 
దుబాయ్‌లో ఉంటున్న జగిత్యాలకు చెందిన రాజు అనే యువకుడు కేసీఆర్ కరోనాతో చనిపోయారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దీంతో రాజుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. 
 
సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్ట్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్‌ కస్టడికి పంపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments