Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయాల దాడులపై స్పందిస్తే వ్యభిచారిణిగా ముద్రవేస్తారా? ఎవరు?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (08:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హిందూ దేవాలయాలపై అనేక దాడులు జరిగాయి. జరుగుతున్నాయి కూడా. ఇప్పటికే వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగినట్టు విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడులను విపక్ష నేతలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అలాగే, బీజేపీ మహిళా నేత, సినీ నటి మాధవీలత కూడా ఖండించారు. ఆలయాలపై దాడులను ఖండిస్తూ, ప్రభుత్వంపై ఆమె ఘాటైన విమర్శలే చేశారు. దీంతో ఆమెపై వైకాపా నేతలు ఎదురుదాడికి దిగారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనై, తనపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
"ఏపీలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించినందుకు వ్యభిచారిణిగా, తిరుగుబోతుగా ముద్రవేస్తారా? ఇంత దారుణంగా వేధిస్తారా? నాపై వ్యక్తిగత విమర్శలకు దిగి, ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. ఎవరినైనా సరే చంపేస్తా" అని మాధవీలత హెచ్చరించారు. 
 
సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అశ్లీల పోస్టులు పెట్టి, అసభ్యకర రాతలు రాసి ట్రోల్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విజయ్‌ మహరాజ్‌ అనే వ్యక్తి నన్ను టార్గెట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు. నన్ను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ధర్నా చేస్తా అని ప్రకటించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments