ఆర్టీసీ బస్సులో ప్రేమ జంట ఆత్మహత్య..

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (18:35 IST)
తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో పడి ఓ బాలక తనువు చాలించింది. ఆర్టీసీ బస్సులో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట నియోజక వర్గంలోని చండ్రుగొండ మండలం సీతాయిగూడెంకు చెందిన అనూష (14) చండ్రుగొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ, తరగతి చదువుతుంది.  అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జగ్గారావు (28) తరుచూ పాఠశాలకు వచ్చేవాడు. ఇద్దరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో అనూష కనిపించకపోవడంతో ఆమె తండ్రి సోమేష్ స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
 
ఇదిలా ఉండగా కొత్తగూడెం డిపోకి చెందిన ఆర్టీసి బస్సులో జగ్గారావు, అనూషలు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఇద్దరూ కనిపించారు. దాంతో డ్రైవర్ గమనించి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. స్పందించిన పోలీసులు ఆ జంటను అశ్వారావుపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందారు. ఇరువురి మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Patriot : మమ్ముట్టి, మోహన్‌లాల్ చిత్రం పేట్రియాట్ హైదరాబాద్‌లో షెడ్యూల్

Priyadarshi: మిత్ర మండలి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్‌టైనర్.. ప్రియదర్శి

శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో రెండవ చిత్రం ప్రారంభం

Sri Vishnu: నక్సలైట్‌ లీడర్‌ కామ్రేడ్ కళ్యాణ్ గా శ్రీ విష్ణు

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments