జైల్లో పెడతారా.. పెట్టుకోండి.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై కవిత

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2022 (10:37 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కవిత పేరు ఉంది. దీంతో ఆమె గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో తన పేరును ఇరికించి, జైల్లో పెట్టేందుకు కుట్ర పన్నారన్నారు. జైల్లో పెట్టుకోవచ్చని, ఈ విషయంలో తనకెలాంటి భయం లేదన్నారు. 
 
ప్రధానిగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయిందన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టి అడ్డదారిలో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారంటూ దుయ్యబట్టారు. 
 
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు రావడానికి ఒక యేడాది ముందు ఆ రాష్ట్రానికి ప్రధాని మోడీ కంటే ఈడీ అధికారులు వస్తారని, దీన్ని ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారని చెప్పారు. మోడీ పాలనలో ప్రభుత్వాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. తెలంగాణాలో వచ్చే డిసెంబరులో ఎన్నికలు ఉండటం వల్లే మోడీ కంటే ముందు ఈడీ వచ్చిందని తెలిపారు. 
 
అందువల్ల తనపైనా, తమ పార్టీకి చెందిన మంత్రులు, నేతల ఇళ్లపై ఈడీ, ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం సహజమేనని చెప్పారు. ఈడీ, ఐటీ దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఈడీ విచారణకు తాము సహకరిస్తామని చెప్పారు. మీడియాకు ముందే లీకులిస్తూ అలజడి రేపుతున్నారంటూ మండిపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్పిరిట్ చిత్రంలో ప్రభాస్‌తో చిరంజీ నటిస్తారా?

అనిల్ రావిపూడికి ఖరీదైన బహుమతి ఇచ్చిన మెగాస్టార్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments