Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నీతో ఉండలేను.. భర్త పిల్లలే నాకు ముఖ్యం.. ప్రియుడికి చెప్పిన వివాహిత.. సూసైడ్

ఓ వివాహిత తన ప్రియుడికి దూరంకావాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడు ప్రియురాలి ఎడబాటును భరించలేనని భావించి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఆత్మహత్య.

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2016 (09:20 IST)
ఓ వివాహిత తన ప్రియుడికి దూరంకావాలని నిర్ణయించుకుంది. దీంతో ఆ యువకుడు ప్రియురాలి ఎడబాటును భరించలేనని భావించి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వివాహేతర సంబంధం కారణంగా జరిగిన ఆత్మహత్య. ఈ వివరాలను పరిశీలిస్తే..మెదక్ జిల్లా పరిధిలోని కోటిపల్లి-చినపులివర్రు రహదారి మధ్యనున్న డొంకలో భట్టిప్రోలు మండలం వెల్లటూరు కొత్తకాలనీకి చెందిన పొట్లూరి ప్రభుదాసు (23) బుధవారం రాత్రి పురుగుల మందు తాగడంతో రాటు తుమ్మ చెట్టుకు ఉరేసుకున్నాడు. 
 
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ అద్దంకి వెంకటేశ్వర్లు యువకుడు వివరాలను సేకరించి తల్లిదండ్రులను విచారించారు. విచారణలో ప్రభుదాసుకు ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. 
 
కానీ ఆ వివాహిత ప్రభుదాసును పక్కనబెట్టినట్లు తెలుస్తోంది. ప్రభుదాసు బెంగళూరులో అక్కబావల దగ్గరకు వెళ్లి నివాసం ఉండటంతో,  ఐదు రోజుల క్రితం తన పిల్లలను హాస్టల్‌ చేర్పించే విషయం మాట్లాడి వస్తానని చెప్పి ఆ వివాహిత బెంగళూరు వెళ్లింది. అక్కడ ప్రభుదాసును కలిసిన ఆ మహిళ, ఇకపై తన భర్త, పిల్లలతో ఉంటానని చెప్పడంతో మనస్తాపం చెందిన యువకుడు సమీపంలోని కోటిపల్లి - చినపులివర్రు డొంక మార్గంలో పురుగుల మందు సేవించడంతో పాటు ఉరి వేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments