Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్​ నాపై ఒత్తిడి చేస్తున్నారు: మంత్రి హరీశ్​రావు

Webdunia
గురువారం, 5 డిశెంబరు 2019 (20:30 IST)
పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​రావు ప్రశంసలు కురిపించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు త్వరగా విడుదల చేయాలంటూ తనపై ఒత్తిడి చేస్తున్నారని హరీశ్​రావు సరదాగా వ్యాఖ్యానించారు.

సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు హరీశ్​రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నామని హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్​లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎఫ్​వో-2019 సదస్సుకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సీఎఫ్​వో పాత్ర మానవ శరీరంలో గుండె కాయ లాంటిదని మంత్రి హరీశ్​ అభివర్ణించారు. కేటీఆర్​ బాగా పనిచేస్తున్నారు.. సరళతర వాణిజ్య విధానంలో ఏటా తొలి వరుసలో నిలుస్తున్నామని ఆర్థిక మంత్రి గుర్తుచేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ కృషిచేస్తూ, మంచి ఫలితాలు సాధిస్తున్నారని హరీశ్​రావు ప్రశంసించారు.

పరిశ్రమలకు ప్రోత్సాహకాలు త్వరగా విడుదల చేయాలంటూ కేటీఆర్ తనపై ఒత్తిడి చేస్తున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. ఆర్థిక రంగం మెరుగుపడేందుకు సీఎఫ్‌వోలు, పారిశ్రామికవేత్తలు సూచనలు ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. సీఎంతో మాట్లాడి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు వీలైనంత త్వరగా అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments